రెడ్డి చరిత్ర
దక్షిణానికి వచ్చిన తరవాత రాష్ట్రకూటులు చాళుక్యులు కాలంలో గ్రామా పెద్దలుగ పనిచేసారు. ఆ తర్వాత కాకతీయుల కాలంలో సైనిక అధికారులుగా మరియు సామంత రాజులుగా పనిచేసారు. ఇనగల బమ్మిరెడ్డి,రేచెర్ల నామిరెడ్డి,బేతిరెడ్డి మరియు రుద్రిరెడ్డిలు సైనిక అధికారులుగా పని చేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. రెడ్లలో అనేక శాఖలు ఉన్నవి. అందులో మోటటి,పాకనాటి,రేనాటి,ఓరుగంటి,భూమంచి,కుంచెటి,పెడకంటి,పంట (దేసటి),వెలనాటి,గూడాటి,మొదలైనవి తెలుగు ప్రాంతాల్లో వినిపిస్తాయి.